Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలపై ఎండ పడనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా? ఐతే కష్టమే

పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (12:43 IST)
పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకుండా..  కనీసం గంటపాటు వారికి శారీరక వ్యాయామం ఉండేలా చూడండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అప్పుడే వారు దృఢంగా ఉండగలుగుతారని.. అవసరమైతే ఎండలో నిలబడినా తట్టుకోగలుగుతారని.. ఇలా చేయడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు చెప్తున్నారు. లేకుండా వారిలో ఇమునిటీ లోపించి.. చిన్న చిన్న సమస్యలే పెను సమస్యలుగా మారిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇప్పటి పిల్లలంతా సాంకేతికతపై పట్టున్న చిచ్చర పిడుగులే. వాళ్లు నాలుగ్గోడల మధ్య కంప్యూటర్‌లూ, ట్యాబ్‌లకే పరిమితమైపోవడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ అలసట వారిని అంటి పెట్టుకునే ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఊబకాయం సరేసరి. ఈ పరిస్థితి దూరం కావాలంటే పిల్లల్ని నలుగురితోనూ కలవనివ్వండి. ఆరుబయట ఆడుకునేలా చూడండి. దీనివల్ల గట్టిగా నవ్వగలుగుతారు. వారి భావోద్వేగాల్ని బహిరంగంగా ప్రకటించగలుగుతారు.
 
రెస్టారంట్‌లోనో, కాఫీ షాపులోనో పిజా, బర్గర్‌... వంటి ఖరీదైన ఆహారాన్ని మీరు వారికి అందించొచ్చు. అవి తినేటప్పుడు పిల్లలూ సంతోషంగా ఉండొచ్చు. కానీ వారి ఆరోగ్యానికి చేసే హానిని గమనించాలి. అందుకే మితంగా తింటూ.. పోషకాహారం తీసుకునేలా పిల్లలకు నచ్చజెప్పాలి. తృణధాన్యాలూ, కాయగూరలూ, పాల వంటి మేలు చేసే ఆహారంతో మీరేం చేసి పెట్టగలరో చూడాలి. చేపలు వారికి పెట్టగలగాలి. పోషకాహారంతో పాటు శరీరానికి వ్యాయామం ఇవ్వగలిగితే.. పిల్లల శరీరం దృఢంగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments