Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలపై ఎండ పడనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా? ఐతే కష్టమే

పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (12:43 IST)
పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకుండా..  కనీసం గంటపాటు వారికి శారీరక వ్యాయామం ఉండేలా చూడండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అప్పుడే వారు దృఢంగా ఉండగలుగుతారని.. అవసరమైతే ఎండలో నిలబడినా తట్టుకోగలుగుతారని.. ఇలా చేయడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు చెప్తున్నారు. లేకుండా వారిలో ఇమునిటీ లోపించి.. చిన్న చిన్న సమస్యలే పెను సమస్యలుగా మారిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇప్పటి పిల్లలంతా సాంకేతికతపై పట్టున్న చిచ్చర పిడుగులే. వాళ్లు నాలుగ్గోడల మధ్య కంప్యూటర్‌లూ, ట్యాబ్‌లకే పరిమితమైపోవడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ అలసట వారిని అంటి పెట్టుకునే ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఊబకాయం సరేసరి. ఈ పరిస్థితి దూరం కావాలంటే పిల్లల్ని నలుగురితోనూ కలవనివ్వండి. ఆరుబయట ఆడుకునేలా చూడండి. దీనివల్ల గట్టిగా నవ్వగలుగుతారు. వారి భావోద్వేగాల్ని బహిరంగంగా ప్రకటించగలుగుతారు.
 
రెస్టారంట్‌లోనో, కాఫీ షాపులోనో పిజా, బర్గర్‌... వంటి ఖరీదైన ఆహారాన్ని మీరు వారికి అందించొచ్చు. అవి తినేటప్పుడు పిల్లలూ సంతోషంగా ఉండొచ్చు. కానీ వారి ఆరోగ్యానికి చేసే హానిని గమనించాలి. అందుకే మితంగా తింటూ.. పోషకాహారం తీసుకునేలా పిల్లలకు నచ్చజెప్పాలి. తృణధాన్యాలూ, కాయగూరలూ, పాల వంటి మేలు చేసే ఆహారంతో మీరేం చేసి పెట్టగలరో చూడాలి. చేపలు వారికి పెట్టగలగాలి. పోషకాహారంతో పాటు శరీరానికి వ్యాయామం ఇవ్వగలిగితే.. పిల్లల శరీరం దృఢంగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments