పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారు?

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (21:22 IST)
చాలా మంది పిల్లలకు చిన్నవయసులో ఉండగా వెండి మొలతాడు కడుతుంటారు. ఇలా ఎందుకు కడుతారో చాలా మందికి తెలియదు. నిజానికి సైన్స్ పరంగా ఇది ఎంతో మేలు చేస్తుంది. అదేంటో తెలుసుకుందాం. 
 
లోహాలకు శరీరంపై ప్రభావంచూపే శక్తి ఉందని గుర్తించినవారు పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువచేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం కలిగి ఉంటుంది.
 
 ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. 
 
విషయంలోకి వస్తే, స్త్రీపురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి. వాటి ఉష్ణోగ్రత సాధరణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. ఈ వృషణాలు, ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద, వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. 
 
అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. 
 
అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం, వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. 
 
బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. 
 
బొడ్డుతాడులో ఉన్న స్టెంసెల్స్‌ను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారమైంది. 
 
రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం స్టెం సెల్ బ్యాంకులు తెరవడం నిజంగా బాధాకరం. ధర్మం మీద, ఆయుర్వేదం మీద నమ్మకముండి, దేశభక్తి కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి, ఆయుర్వేదశాస్త్రంలో సనాతనధర్మం కోల్పోయిన ఈ స్టెం సెల్స్ వైద్యాన్ని తిరిగి పునరుద్ధిరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి

రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను త్వరలోనే అభివృద్ధి చేస్తాం.. నారాయణ

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

తర్వాతి కథనం
Show comments