పిల్లలు చెప్పిన మాట వినాలంటే పారెంట్స్ ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (17:44 IST)
పిల్లలకి కాస్త సమయం దొరికితే చాలు.. ఇల్లు పీకి పందిరేస్తారు. చెప్పిన మాట పట్టాన వినరు. అలాగని అన్నిసార్లూ కోప్పడి ఒకేచోట కూర్చోబెట్టడం సాధ్యం కాదు. అందుకే చెబితే మాట వినేలా తీర్చి దిద్దాలంటే.. పారెంట్స్ ఇలా చేయాలి.. 
 
* "వాడు ఎం చెప్పినా వినడు, నచ్చిందే తప్ప, వేరే పనేదీ చేయడు'' అంటూ పదే  పదే తల్లిదండ్రులు పిల్లల ముందే వారిలోని ప్రతికూల లక్షణాలను పదే పదే చెబుతుంటారు. వారు నిజంగానే అలా ప్రవర్తిస్తున్నా, ఇలా చెబుతుండటం వల్ల అమ్మ తేలిగ్గా తీసుకుంది. ఫరవాలేదులే అన్న ధీమాకు వచ్చేస్తారు. అలా కాకుండా మా అమ్మాయి లేదా అబ్బాయి చెప్పిన మాట వింటారు. త్వరగా అర్థం చేసుకుని పని పూర్తి చేస్తుంది. అని చెబుతూ ఉంటే కచ్చితంగా వారిలో సానుకూల మార్పు ఉంటుంది. 
 
* పిల్లలు స్కూలు నుంచి ఇంటికొచ్చాక కాసేపు హోం వర్క్ చేసుకోవడం, లేదంటే టీవీ చూడటం వంటి వాటితోనే సమయం గడిచిపోతోందా? ఇలా కాకుండా వారికి నచ్చిన విధంగా కథల పుస్తకాలు, డ్రాయింగ్, పాటలు వినడం వంటివి చేయిస్తే వారిలో మార్పులు వస్తాయి. 
 
* పిల్లల్ని వంటగదిలోకి రానివ్వండి. చిన్న చిన్న పనులు అలవాటు చేయండి. కూరగాయల్ని శుభ్రంగా కడిగి ఇవ్వమనడం, డైనింగ్ టేబుల్ తుడవడం వంటివి అలవాటు చేస్తే సరిపోతుంది. వారు సరిగ్గా చేయకపోయినా విసుగు ప్రదర్శించకుండా వారికి నచ్చజెప్పే విధంలో కొంత మార్పు చేసుకోండి.. అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్

ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్‌లో ఐబీఎం సేవలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Show comments