Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పూట 3 గంటలు సోషల్ మీడియా వాడే పిల్లల్లో సంతోషం ఉండదండోయ్..

సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు ఇప్పటికే గంగలో కలిసిపోయాయని సర్వేలో తేల్చాయి. ఎందరో దంపతులు సోషల్ మీడియా కారణంగా తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అలాంటి సోషల్ మీడియా మేలు మాత్రం కొంతే

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (17:39 IST)
సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు ఇప్పటికే గంగలో కలిసిపోయాయని సర్వేలో తేల్చాయి. ఎందరో దంపతులు సోషల్ మీడియా కారణంగా తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అలాంటి సోషల్ మీడియా మేలు మాత్రం కొంతే అయితే.. కీడు మాత్రం నాలుగింతలు ఎక్కువేనని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
తాజాగా సోషల్ మీడియా పిల్లలకూ ముప్పు తప్పదని బ్రిటన్‌లోని ఎసెక్స్‌ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఎలాగంటే..? సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లను ఏ పిల్లలైతే తరచూ వాడుతుంటారో వాళ్ళు.. సోషల్ మీడియా ఉపయోగించని పిల్లల కంటే హ్యాపీగా ఉండలేరని తేలింది. అంతేకాకుండా సోషల్ మీడియాను తరచూ వాడే పిల్లలు.. తల్లిదండ్రులతో తరచూ గొడవకు దిగుతారని.. వారితో సంబంధాలను బలపరుచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించరని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
దాదాపు మూడువేల ఐదు వందల మంది పిల్లల మీద జరిగిన పరిశోధనలో 10-15 ఏళ్ల వయస్సున్న పిల్లలు పాల్గొన్నారు. వీరిపై జరిగిన పరిశోధనలో రోజుకు ఒక రాత్రి పూట 3 గంటల పాటు ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో వారిలో కేవలం 53 శాతం మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారని వెల్లడైంది. ఎఫ్‌బీ, ట్విటర్‌ వంటివేవీ వాడని పిల్లలు 83 శాతం సంతోషంగా ఉండగలుగుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. సో.. పిల్లలకు సోషల్ మీడియాను అలవాటు చేయకపోవడం ఎంత బెటరని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

Maoists Gajarla Ravi: అలిపిరి అడవుల్లో బాబుపై బాంబు దాడి-మావో చలపతి భార్య అరుణ మృతి

Godavari-Banakacherla Link Project: గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments