పిల్లలకు ఏ సైజ్ ప్లేటులో అన్నం పెడుతున్నారా?

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (16:57 IST)
అన్నం వడ్డించే ప్లేటులపై పిల్లలు ఆహారం తీసుకోవడం ఆధారపడివుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని తాజా అధ్యయనంలో తేలింది. నిర్దిష్ట పరిమాణంలో తిండి తీసుకోవాలనే అవగాహన పిల్లల్లో ఉండదు. అలవాటు కూడా ఉండదు. అందుకే వారి భోజనం అలవాటు ఎప్పటికప్పుడు మారుతుంది. 
 
చిన్నపిల్లలు ఎంత తింటున్నారనేది వారి పళ్లెం సైజును బట్టి ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో గుర్తించారు. పిల్లలకు సరిపోయేలా ఉండే పళ్లెంలో వడ్డించినప్పుడు వారు మితంగానే తిన్నారు. 
 
అదే పెద్ద పళ్లేల్లో వడ్డించినప్పుడు.. ఎక్కువ వడ్డించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ కేలరీలు తీసుకున్నారట. మాంసాహారం తీసుకునే సమయంలో ఇలా పళ్లేన్ని బట్టి ఎక్కువ వడ్డించుకోవడం బాగా పెరుగుతుందట. అందుకే పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని పరిశోధకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments