ఎదిగిన పిల్లలకు తల్లి స్పర్శలోని ఆనందం తెలియదట..అందుకే డిప్రెషన్!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:23 IST)
గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి స్పర్శతో తృప్తి చెందుతారట. అది నెలల్లో ఉన్న పిల్లలైనా సరే మూడేళ్ల పిల్లలైనా సరే.. తల్లి స్పర్శకే అభద్రతా భావం నుంచి వారిని బయటి తీసుకొచ్చే శక్తి వుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి దగ్గరకు చేర్చుకుని చేతులతో పొదివి పట్టుకోగానే ఏడుపు ఆపేస్తారు. అంతవరకు ఉన్న బాధ ఒక్కసారిగా అలానే మాయమవుతుంది. 
 
వాస్తవానికి స్పర్శకు బాధను పోగొట్టే శక్తి వుంది. చర్మం స్పర్శాంగం. ఇది బాధను గ్రహించినట్టే.. ఆనందాన్ని గ్రహించగలదు. నిజానికి చర్మంమీద బాధను పసిగట్టే నాడీతంతులు వున్నట్టే. ఆనందాన్ని గ్రహించి మెదడుకు చేరవేసే భాగాలు వుంటాయి. ఆ స్పర్శ కేంద్రాలను తట్టినప్పుడు లేదా నెమ్మదిగా తాకినప్పుడు ఆ సంకేతాలు మెదడుకు చేరతాయి. క్రమంగా బాధను తీసుకెళ్లే నాడుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. 
 
అందుకే పిల్లలను తల్లిదగ్గరికి తీసుకున్నప్పుడు తెలియకుండానే ఆ భాగాలమీద ఒత్తిడి పడుతుంది. ఈ కారణం చేతనే పిల్లలు ఏడుపు ఆపేస్తారు. చిన్నతనంలో తల్లిదండ్రుల స్పర్శను సరిగా అనుభవించని పిల్లల్లో ఆ నాడీకేంద్రాల మీద స్పర్శ ప్రభావం పడనందున ఎదిగిన తర్వాత స్పర్శతో ఆనందం పొందటం తెలియక సులభంగా డిప్రెషన్‌కు గురవుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments