ఎదిగిన పిల్లలకు తల్లి స్పర్శలోని ఆనందం తెలియదట..అందుకే డిప్రెషన్!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:23 IST)
గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి స్పర్శతో తృప్తి చెందుతారట. అది నెలల్లో ఉన్న పిల్లలైనా సరే మూడేళ్ల పిల్లలైనా సరే.. తల్లి స్పర్శకే అభద్రతా భావం నుంచి వారిని బయటి తీసుకొచ్చే శక్తి వుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి దగ్గరకు చేర్చుకుని చేతులతో పొదివి పట్టుకోగానే ఏడుపు ఆపేస్తారు. అంతవరకు ఉన్న బాధ ఒక్కసారిగా అలానే మాయమవుతుంది. 
 
వాస్తవానికి స్పర్శకు బాధను పోగొట్టే శక్తి వుంది. చర్మం స్పర్శాంగం. ఇది బాధను గ్రహించినట్టే.. ఆనందాన్ని గ్రహించగలదు. నిజానికి చర్మంమీద బాధను పసిగట్టే నాడీతంతులు వున్నట్టే. ఆనందాన్ని గ్రహించి మెదడుకు చేరవేసే భాగాలు వుంటాయి. ఆ స్పర్శ కేంద్రాలను తట్టినప్పుడు లేదా నెమ్మదిగా తాకినప్పుడు ఆ సంకేతాలు మెదడుకు చేరతాయి. క్రమంగా బాధను తీసుకెళ్లే నాడుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. 
 
అందుకే పిల్లలను తల్లిదగ్గరికి తీసుకున్నప్పుడు తెలియకుండానే ఆ భాగాలమీద ఒత్తిడి పడుతుంది. ఈ కారణం చేతనే పిల్లలు ఏడుపు ఆపేస్తారు. చిన్నతనంలో తల్లిదండ్రుల స్పర్శను సరిగా అనుభవించని పిల్లల్లో ఆ నాడీకేంద్రాల మీద స్పర్శ ప్రభావం పడనందున ఎదిగిన తర్వాత స్పర్శతో ఆనందం పొందటం తెలియక సులభంగా డిప్రెషన్‌కు గురవుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... భారత్‌కు వచ్చిన చమురు ట్యాంకర్లు

చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి

పునర్విభజన పేరుతో రాజ్యాంగంపై దాడి : సోనియా గాంధీ

నాకు అందమైన అమ్మాయిని, బిలియన్ డాలర్ల డబ్బు పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

Arvind Krishna: కర్మస్థలం చిత్రంలో యోధుడిలా కన్పించనున్న అరవింద్ కృష్ణ

T. Gopichand: భరత భూమికి ప్రతీకగా నిలిచే భరత వర్ష గా టి గోపీచంద్ రాబోతున్నాడు

Nagababu: చిరంజీవికి గుండె కుడివైపు ఉంటే ఏమవుతుంది...!

Show comments