Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు పాలతో కమలాపండు కలిపి తినిపిస్తున్నారా?

చిన్నారులకు పాలతో పాటు కమలాపండును తినిపిస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. చాలామంది చిన్నారులకు పాలతో పండ్లు కూడా తినిపిస్తారు. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటారు. అయితే పాలతో పాటు కమలా ప

Webdunia
బుధవారం, 17 మే 2017 (12:22 IST)
చిన్నారులకు పాలతో పాటు కమలాపండును తినిపిస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. చాలామంది చిన్నారులకు పాలతో పండ్లు కూడా తినిపిస్తారు. దానివల్ల  వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటారు. అయితే పాలతో పాటు కమలా పండును చిన్నారులకు ఒకేసారి ఆహారంగా ఇస్తే వారిలో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కమలాఫలమే కాదు, దాన్నుంచి తీసిన రసం కూడా పాలు తాగిన వెంటనే ఇవ్వకూడదు. అలాగే రెండు రకాల పండ్లను ఒకేసారి ఇవ్వకూడదు. పూటకో పండు ఇస్తే సరిపోతుంది. 
 
ఇదేవిధంగా పైనాపిల్‌లో ఉండే బ్రోమిలెన్‌ పదార్థం పాలల్లో కలిపినప్పుడు విషపూరితంగా మారుతుంది. దీనికారణంగా తలనొప్పి, కడుపునొప్పి వస్తాయి. అలాగే జీర్ణకోశ సంబంధిత సమస్య ఉత్పన్నమవుతుంది. వాంతులు అవుతాయి. కొన్ని సందర్బాల్లో ఇన్ఫెక్షన్లకు లేదా డయేరియాకు దారితీస్తుంది.
 
బొప్పాయిని నిమ్మపండు కలిపి తినిపించకూడదు. ఇలా చేస్తే హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమయ్యే ఛాన్సుంది. ఫలితంగా చిన్నారుల్లో ఎనీమియాకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెంటినీ కలిపి చిన్నారులకు పెట్టకపోవడం ఉత్తమం అని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments