Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోనులో నాలుగైదు సిమ్‌లుంటే ఎంత బావుండో..

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో ఇతర టెలికామ్ ఆపరేటర్లకు సవాల్‌గా మారింది. వినూత్నమైన టారిఫ్ ప్లాన్స్‌తో రిలయన్స్ జియోకు పోటీనిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఇప

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (19:48 IST)
రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో ఇతర టెలికామ్ ఆపరేటర్లకు సవాల్‌గా మారింది. వినూత్నమైన టారిఫ్ ప్లాన్స్‌తో రిలయన్స్ జియోకు పోటీనిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. జియోకు ధీటుగా ఇతర టెలికామ్ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో నెట్‌ వర్క్ కంపెనీలు ఇచ్చే వరుస ఆఫర్లతో కస్టమర్లు తెగ ఖుషీగా ఉన్నారు. ఏ నెట్‌వర్క్ ఎంచుకోవాలో అర్థం కాక.. స్మార్ట్‌ ఫోన్‌‌లో నాలుగైదు సిమ్‌‌లుంటే ఎంత బాగుంటుందని వినియోగదారులు భావిస్తున్నారు. జియో ప్రారంభించిన ఈ పోరులో ఇతర సంస్థలు కూడా జత కలవడంతో.. డేటా ప్యాక్ ధరలను భారీగా తగ్గిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో దెబ్బతో దిగొచ్చిన ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలతో పాటు బీఎస్ఎన్‌ఎల్ కూడా ఆఫర్ల బాట పట్టింది. 
 
తాజాగా జియోకి గట్టి పోటీ ఇస్తున్న దిగ్గజ నెట్‌ వర్క్ కంపెనీ ఎయిర్‌ టెల్ మరో ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌‌ని ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్లు 30 రోజుల పాటు 75 ఎంబీ 2జీ, 3జీ, 4జీ డేటాను పొందవచ్చునని సంస్థ వెల్లడించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments