జియోమీ ధాటికి శామ్‌సంగ్ ఏమౌతుందో?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (18:18 IST)
సాధారణంగా పండుగ అంటేనే.. స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడం ఫ్యాషనైపోయింది. పండుగ సందర్భంగా డిస్కౌంట్ సేల్, క్యాష్ బ్యాక్, ఉచిత ఆఫర్లను స్మార్ట్‌ఫోన్లపై ఇవ్వడం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని దక్షిణ కొరియా సంస్థ అయిన శామ్‌సంగ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్10, ఎమ్20 ఫోన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
బడ్జెట్ రకాలకు చెందిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లను శామ్‌సంగ్ పండుగ సందర్భంగా విడుదల చేయడంపై కొత్త చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బడ్జెట్ రకాల స్మార్ట్‌ఫోన్లంటే.. జియోమీ, ఒప్పో, వివో బ్రాండ్‌లే గుర్తుకు వస్తాయి. అందులో ముఖ్యంగా శామ్‌సంగ్‌కు పోటీగా నిలుస్తున్నది జియోమీ మాత్రమే. గత దీపావళి సేల్‌లో కూడా జియోమీ స్మార్ట్‌ఫోన్లే అధికంగా అమ్ముడుపోయాయి. 
 
ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే శామ్‌సంగ్ ఫోన్లు ఏమేరకు అమ్ముడుపోతాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జియోమీ ధాటికి శామ్‌సంగ్ తట్టుకుని నిలుస్తుందా అని వాణిజ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
శామ్‌సంగ్ నుంచి విడుదల అయ్యే శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్ రూ.9.500లకు, శామ్‌సంగ్ ఎమ్20 రూ.15వేలకు పొందవచ్చు. ఇవి కాకుండా.. శామ్‌సంగ్ ఎమ్30 మోడల్ కూడా మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments