Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ ఫోన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:36 IST)
యువతను ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్‌లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమీ. భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. తాజాగా ఈ సంస్థ నుండి మరో రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
 
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో షియోమీ ఎమ్‌డి మనుకుమార్ జైన్ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో అనే మరో రెండు మోడల్‌లను లాంఛ్ చేసారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్న రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ధరను రూ. 13,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధరను రూ. 16,999గా నిర్ణయించారు. ఇక మరో మోడల్ రెడ్‌మీ నోట్ 7లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ మెమరీ గల మొబైల్ ధర రూ. 9,999 కాగా, 4 జీబీ ర్యామ్ +64 ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ ధర రూ. 11,999గా నిర్ణయించారు.
 
ఈ రెండు మోడళ్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అందించబడ్డాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ఫోన్‌లో ఇదివరకు ఎన్నడూలేని విధంగా 48 మెగాపిక్సెల్ కలిగిన బ్యాక్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లను మార్చి 6 నుండి అందుబాటులోకి తెస్తామని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments