అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ ఫోన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:36 IST)
యువతను ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్‌లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమీ. భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. తాజాగా ఈ సంస్థ నుండి మరో రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
 
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో షియోమీ ఎమ్‌డి మనుకుమార్ జైన్ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో అనే మరో రెండు మోడల్‌లను లాంఛ్ చేసారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్న రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ధరను రూ. 13,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధరను రూ. 16,999గా నిర్ణయించారు. ఇక మరో మోడల్ రెడ్‌మీ నోట్ 7లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ మెమరీ గల మొబైల్ ధర రూ. 9,999 కాగా, 4 జీబీ ర్యామ్ +64 ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ ధర రూ. 11,999గా నిర్ణయించారు.
 
ఈ రెండు మోడళ్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అందించబడ్డాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ఫోన్‌లో ఇదివరకు ఎన్నడూలేని విధంగా 48 మెగాపిక్సెల్ కలిగిన బ్యాక్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లను మార్చి 6 నుండి అందుబాటులోకి తెస్తామని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments