Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ ఫోన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:36 IST)
యువతను ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్‌లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమీ. భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. తాజాగా ఈ సంస్థ నుండి మరో రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
 
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో షియోమీ ఎమ్‌డి మనుకుమార్ జైన్ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో అనే మరో రెండు మోడల్‌లను లాంఛ్ చేసారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్న రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ధరను రూ. 13,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధరను రూ. 16,999గా నిర్ణయించారు. ఇక మరో మోడల్ రెడ్‌మీ నోట్ 7లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ మెమరీ గల మొబైల్ ధర రూ. 9,999 కాగా, 4 జీబీ ర్యామ్ +64 ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ ధర రూ. 11,999గా నిర్ణయించారు.
 
ఈ రెండు మోడళ్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అందించబడ్డాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ఫోన్‌లో ఇదివరకు ఎన్నడూలేని విధంగా 48 మెగాపిక్సెల్ కలిగిన బ్యాక్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లను మార్చి 6 నుండి అందుబాటులోకి తెస్తామని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments