Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి షియోమీ నోట్-4.. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ ఫీచర్‌తో ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (16:45 IST)
భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి షియోమీ విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినా ఢిల్లీలో 19న షియోమీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలిసింది. 
 
ఇక షియోమీ నోట్4లో 2జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గ మెమొరీ ఉంది. ఇంకా 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే(1920X1080 పిక్సెల్స్), 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుందని షియోమీ వెల్లడించింది. 
 
ఇందులో 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ వున్నాయని షియోమీ తెలిపింది. ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌ను ఫీచర్‌ను కలిగివుంటుంది. దీని ధర రూ.10వేల నుంచి రూ.13వేల లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments