Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి రెడ్ మీ 5ఏ: ఫీచర్స్.. ఫస్ట్ లుక్ (వీడియో)

భారత మార్కెట్లోకి షియోమి సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అది కూడా చౌక ధరకే. దేశ్‌కా స్మార్ట్ ఫోన్ అన్నట్లు షియోమీ విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5ఏ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (17:38 IST)
భారత మార్కెట్లోకి షియోమి సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అది కూడా చౌక ధరకే. దేశ్‌కా స్మార్ట్ ఫోన్ అన్నట్లు షియోమీ విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5ఏ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి వుంటుంది. ఆకట్టుకునే ఫీచర్లతో.. ఫ్లిఫ్ కార్ట్ స్టోర్‌‌లో డిసెంబర్ ఏడో తేదీ నుంచి తొలి సేల్ ప్రారంభం అవుతుంది. 
 
గురువారం జరిగిన ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమంలో ధర, ఫీచర్లను ప్రకటించారు. దీని గురించి ప్ర‌త్యేకంగా రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్లు కూడా చేసింది. తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ 16బీజీ)ను రూ.4,999కే అందించనున్న‌ట్లు రెడ్‌మీ ఇండియా ప్ర‌క‌టించింది. తొలుత బుక్ చేసుకునే 50లక్షల రెడ్ మి5 కస్టమర్లకు ఐదువేల ధరను.. ఆపై రూ.5,999లకు ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. 
 
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయంతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్‌ను కలిగివుంటుంది. 2జీబీ ర్యామ్, 5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు, 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోను కలిగివుంటుంది. డుయెల్ సిమ్ (నానో ప్లస్ నానో), ఎంఐయుఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ నాగౌట్‌తో ఇది పనిచేస్తుంది. ఏడు గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ సర్వీస్, 137 గ్రాముల బరువును ఈ స్మార్ట్ ఫోన్ కలిగివుంటుందని సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను వీడియోలో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments