అలాంటి మెసేజ్‌ను టచ్ చేస్తే మీ ఫోన్ అంతేసంగతులు..

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది.

Webdunia
సోమవారం, 7 మే 2018 (14:25 IST)
అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది. అందులో బంతి ఆకారంలో వచ్చే ఏ ఎమోజీ ఉన్న మెసేజ్‌ను టచ్ చేసినా యూజర్ల వాట్సాప్ యాప్ హ్యాంగ్ అవుతున్నట్టు గుర్తించారు. మరికొంతమంది యూజవర్లకు ఏకంగా ఫోన్లే పనిచేయకుండా పోతున్నాయి.
 
అయితే నిజానికి ఇది వాట్సాప్‌లో వచ్చిన సమస్య కాదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వల్లే సదరు బంతి లాంటి ఎమోజీలను టచ్ చేసినప్పుడు యాప్స్, ఫోన్లు హ్యాంగ్ అవుతున్నట్లు సాఫ్ట్‌వేర్ నిపుణులు గుర్తించారు. సదరు ఎమోజీలను వాట్సాప్‌లో కాకుండా ఏ ఇతర మెసేజింగ్ యాప్‌లో వాడినా పరిస్థితి ఇలాగే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
దీంతో అలాంటి ఎమోజీలు ఉన్న మెసేజ్‌లను ఓపెన్ చేయడం, ఆ ఎమోజీలను టచ్ చేయడం చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా గూగుల్ టెక్ నిపుణులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

తర్వాతి కథనం
Show comments