Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల భారం.. వొడాఫోన్ కొత్త మేనేజర్‌కి మూడేళ్ల పాటు నో శాలరీ

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:15 IST)
కరోనా వైరస్ కారణంగా పలువురు ఉద్యోగాలును కోల్పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వొడాఫోన్‌ను అప్పుల భారం కూడా వేధిస్తోంది. ఒక్క టెలికాం శాఖకే వొడాఫోన్ దాదాపు 7854 కోట్లు బాకీ పడింది. ఈ నేపథ్యంలోనే భాగంగా సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అతిపెద్ద టెలికాం సంస్థగా ఒకప్పుడు గుర్తింపు పొందిన వొడాఫోన్ ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో వినియోగదారులను కోల్పోతున్న విషయం తెలిసిందే.  
 
ఇలాంటి పరిస్థితుల్లో వొడాఫోన్ కొత్త మేనేజర్, సీఈఓ రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల పాటు ఎటువంటి వేతనం ఇవ్వకూడదనే యోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విధుల్లో భాగంగా ఆయన చేసే ఇతర వ్యయాలన్నీ కంపెనీనే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఓ ప్రతిపాదనపై రాబోయే వార్షిక సమావేశాల్లో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. 
 
త్వరలో జరగనున్న 25 వార్షిక సమావేశాలకు ముందు ఇచ్చిన నోటీసులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. కాగా.. రవీందర్‌ రాకమునుపు వొడాఫోన్‌కు సీఈఓగా సేవలందించిన బాలేశ్ శర్మ రూ. 8.59 కోట్లు ఆదాయంగా పొందినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments