Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ మారింది.. వీవో స్మార్ట్‌ఫోన్ బాక్సులపై 'మేక్ ఇన్ ఇండియా'

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (19:13 IST)
సీన్ మారింది. అవును. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో తన లోగో డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీకి మద్దతుగా దేశంలో వివో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్ల బాక్సులపై ఇక నుంచి మేక్ ఇన్ ఇండియా అని కనిపించనుంది.

మొబైల్‌ పరికరాల తయారీ కోసం భారత్‌లో సుమారు 7500కోట్ల పెట్టుబడులు పెట్టాలని గత ఏడాదే వివో నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్‌లో విక్రయించే ప్రతి వివో ఫోన్‌ కూడా నోయిడాలోని వివో ఫ్యాక్టరీలోనే తయారవుతున్న సంగతి విదితమే.
 
దీనిపై వివో ఇండియా ట్వీట్ చేస్తూ.. ఆత్మనిర్భర్ భారత్‌కు తాము మద్దతిస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీ మేక్ ఇండియా నిబద్ధతకు జీవం పోస్తూ.. ముంబైకి చెందిన రాహుల్‌ పటేల్‌ రూపొందించిన లోగోను రాబోయే అన్ని డివైజ్‌లపై ముద్రిస్తామని వెల్లడించింది. ప్రతి వివో పరికరం భారత్‌లోనే తయారవుతుందనే వాస్తవాన్ని దీని ద్వారా నొక్కి చెప్పాలనుకుంటున్నామని వివో ఇండియా ట్విటర్లో పేర్కొంది.
 
మరోవైపు.. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ 'వివో' త్వరలో వివో X50 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. మొదటగా చైనాలోనే కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. జూన్‌ 1న లాంచింగ్‌ ఈవెంట్‌లో 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. వైబోలో ఫోన్‌ విడుదలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసింది. త్వరలోనే భారత మార్కెట్లో కూడా దీన్ని లాంచ్‌ చేయనుందని అంచనా.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments