Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కరోనా మాయ.. లావాదేవీలన్నీ డిజిటల్ మయం..

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:57 IST)
నోట్ల రద్దు తర్వాత క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. అనేక రకాల యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. గల్లీలో ఉండే చిన్న కొట్టు నుంచి ఫైవ్ స్టార్‌ హోటల్‌ వరకు అంతా డిజిటల్ మయమైపోయింది. బ్యాంకులో డబ్బు ఉంటే చాలు.. జేబులో స్మార్ట్‌ ఫోన్‌ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. 
 
కరోనా కారణంగా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసే వాల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరెన్సీతోనూ కరోనా వ్యాప్తికి అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగడంతో.. డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
 
ఈ క్రమంలోనే దేశంలో యూపీఐ ద్వారా అక్టోబర్‌ నాటికి రెండు వందల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని తెలియవచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది నూట 14 కోట్లుగా ఉంది. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భారీగా పెరుగుల నమోదైనట్టు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్వీట్‌ చేశారు. 
 
గత ఏడాదితో పోలిస్తే లావాదేవీలు 80 శాతం పెరిగాయి. అలాగే, లావాదేవీల విలువలో 101 శాతం పెరుగుదల నమోదైంది. లక్షా 91 వేల 359 కోట్ల రూపాయల నుంచి 3 లక్షల 86 వేల 106 కోట్ల రూపాయలకు పెరిగినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments