యూసీ బ్రౌజర్‌పై కన్నేసిన కేంద్రం.. వ్యక్తిగత వివరాలు చైనా సర్వర్‌కు వెళ్ళిపోతున్నాయట..

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియో

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:35 IST)
చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఎంఎస్‌ఐ, ఐఎంఈఐ నంబర్లను, లొకేషన్‌ వివరాలను చైనాలోని సర్వర్‌కు పంపుతోందని సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ల్యాబ్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
 
యూసీ బ్రౌజర్ వైఫైకి అనుసంధానం అయినప్పుడు వినియోగదారుడి ఫోన్‌ వివరాలతో పాటు, యాక్సెస్‌ చేసే నెట్‌వర్క్‌ సమాచారం చైనాలోని ఓ సర్వర్‌కు పంపుతున్నట్లు ఆంగ్ల పత్రిక తెలిపింది. ఈ ల్యాబ్ విచారణలో యూసీది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు విడతలుగా 30 మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తాజాగా రిలయన్స్‌ జియోకు చెందిన లైఫ్‌ బ్రాండ్‌ ఫోన్లతో పాటు, వీడియోకాన్‌, మైజు కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments