Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూసీ బ్రౌజర్‌పై కన్నేసిన కేంద్రం.. వ్యక్తిగత వివరాలు చైనా సర్వర్‌కు వెళ్ళిపోతున్నాయట..

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియో

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:35 IST)
చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఎంఎస్‌ఐ, ఐఎంఈఐ నంబర్లను, లొకేషన్‌ వివరాలను చైనాలోని సర్వర్‌కు పంపుతోందని సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ల్యాబ్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
 
యూసీ బ్రౌజర్ వైఫైకి అనుసంధానం అయినప్పుడు వినియోగదారుడి ఫోన్‌ వివరాలతో పాటు, యాక్సెస్‌ చేసే నెట్‌వర్క్‌ సమాచారం చైనాలోని ఓ సర్వర్‌కు పంపుతున్నట్లు ఆంగ్ల పత్రిక తెలిపింది. ఈ ల్యాబ్ విచారణలో యూసీది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు విడతలుగా 30 మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తాజాగా రిలయన్స్‌ జియోకు చెందిన లైఫ్‌ బ్రాండ్‌ ఫోన్లతో పాటు, వీడియోకాన్‌, మైజు కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments