Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ నుంచి ఇద్దరు టాప్ ఉద్యోగులు ఔట్...

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:30 IST)
ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీంతో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ఈ తరహా ఆందోళనను బహిరంగంగా కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ నుంచి ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అదేసమయంలో సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తప్పించి, ఎలాన్ మస్క్‌ సీవీవోగా కొనసాగుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ట్విట్టర్ నుంచి ఇద్దరు టాప్ ఉద్యోగులు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రీసెర్స్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగం లీడ్ చేస్తున్న జనరల్ మేనేజర్ కేవ్వాన్ బేక్పూర్, ప్రొడక్ట్స్ విభాగం అధిపతి బ్రూస్ ఫాల్క్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ఈవార్తలకు కేవ్యాన్ వివరణ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని, కానీ ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించారని చెప్పారు. తనను రాజీనామా చేయాలని పరాగ్ అగర్వాల్ చెప్పారని వెల్లడించారు. 
 
అలాగే, ఈ వారం నుంచి కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. పనికి అవసరమైన అత్యంత ముఖ్యమైన నియామకాలు మినహా ఇతర నియామకాలు చేపట్టబోమని స్పష్టం చేసింది. సంస్థకు మస్క్ చేపట్టిన తర్వాత పరాగ్ అగర్వాల్‌తో సహా మరికొందరు సీనియర్ అధికారు వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments