Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరాటం .. ట్విట్టర్ ఫౌండర్ భారీ విరాళం

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:54 IST)
ప్రపంచం కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. శక్తిమేరకు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటం కోసం తమవంతుగా అనేకమంది దాతలు విరాళాలను ఇస్తున్నారు. ఇలాంటి వారిలో ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సే కూడా చేరిపోయారు. ఈయన బిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. కోవిడ్‌19పై పోరాటానికి బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
త‌న సంప‌ద‌లోని 28 శాతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు డార్సే పేర్కొన్నారు. త‌న వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ స‌మాచారాన్ని తెలిపారు. అయితే తాను ఇవ్వ‌బోయే నిధుల‌ను ఎవ‌రికి ఇస్తార‌న్న విష‌యంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
ప్ర‌స్తుతానికి అమెరికాలో వెంటిలేట‌ర్లు, పీపీఈల కొర‌త ఉన్న‌ది. స్క్వేర్ సంస్థ‌లో ఉన్న‌ త‌న షేర్ల‌ను విరాళం రూపంలో వినియోగించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సార్ట్ స్మాల్ ఫౌండేష‌న్ ద్వారా వీటిని ఖ‌ర్చు చేస్తారు. 
 
ట్విట్ట‌ర్‌తో పాటు స్క్వేర్ సంస్థ‌కు కూడా డార్సీ సీఈవోగా ఉన్నారు. అయితే విరాళం కోసం వాడే షేర్ల‌న్నీ స్క్వేర్ సంస్థ‌వే అన్నారు. బాలిక‌ల చ‌దువు, ఆరోగ్యం, ప‌రిశోధ‌న గురించి వాటిని వినియోగించ‌నున్న‌ట్లు జాక్ డార్సే చెప్పారు. మొత్తంగా ఆయన ఒక బిలియన్ డాలర్ల మేరకు విరాళంగా ఇవ్వనున్నారని ఫోర్బ్స్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments