TRAI: సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో ట్రాయ్ కొత్త ప్రకటన- రీఛార్జ్ యూజర్లకు గుడ్ ఛాన్స్

సెల్వి
సోమవారం, 20 జనవరి 2025 (15:22 IST)
టెలికామ్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఇకపై రీఛార్జ్ చేసుకోబోయే యూజర్లకు మంచి అవకాశాన్ని ప్రకటించింది. దీనిద్వారా తరచూ సిమ్ కార్డులు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. 
 
ఈ 90 రోజుల్లో దాటిన తర్వాత కూడా జియో యూజర్లు సిమ్ కార్డ్ రీఛార్జ్ చేసుకోకపోతే ఆ నెంబర్‌ పర్మినెంట్‌గా తొలగిస్తారు. ఇతర కొత్త యూజర్లకు ఆ నెంబర్‌ను కేటాయిస్తారు. అందుచేత గడువు ముగిసే లోపు రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది. 
 
ఎయిర్‌టెల్ ఉపయోగించే యూజర్లు కూడా 90 రోజుల పాటు రీఛార్జ్ లేకుండా సిమ్ కార్డ్ యాక్టివ్‌గానే ఉంటుంది. యూజర్లు 15 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. వొడాఫోన్ యూజర్లు మాత్రం 90 రోజులపాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. రీఛార్జ్ చేసుకోకుండా సిమ్ యాక్టివ్‌గానే ఉంటుంది. వీళ్లు కచ్చితంగా రూ.49 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది. 
 
ప్రభుత్వ టెలికారం రంగం అయిన బీఎస్ఎన్ఎల్ సిమ్ ఎటువంటి రీఛార్జ్ లేకుండా 180 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ఇది తరచుగా రీఛార్జ్‌లను నివారించాలనుకునే వారికి అత్యంత యూజర్ ఫ్రెండ్లీ ఎంపికగా మారుతుంది. 
టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT), ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాతో సహా ప్రధాన టెలికాం ఆపరేటర్లను కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.
 
మరోవైపు కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసేవారికి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్ర టెలికాం శాఖను డాట్ ఆదేశించింది. భవిష్యత్తులో మీరు ఓటరు ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను తీసుకెళ్లినప్పటికీ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. ఈ కొత్త రూల్‌తో సిమ్‌కార్డుల ద్వారా జరిగే మోసాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments