ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించనున్న టీటీడీ.. ఎలాగంటే..? (video)

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:48 IST)
AI Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించనుంది. శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తుల సేవలను మెరుగుపరిచేందుకు.. విజన్ 2047లో భాగంగా తిరుమల పవిత్రతను కాపాడుతూనే.. దర్శనం, వసతులకు సంబంధించిన సేవలను మెరుగుపరుచనుంది. 
 
ఇదెలా సాధ్యమంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన ఒక ఫేస్ రికగ్నైజేషన్ మిషన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతోటే మన ఫేస్ క్రీమ్‌పై కనిపిస్తుంది.. అలాగే ఆ మిషన్ మనకు దర్శనం స్లిప్పులను కూడా ఇస్తుంది. ఇక స్లిప్పులు తీసుకొని నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పేస్ రికగ్నిషన్ ఎంట్రీ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు. 
 
దీనికి సంబంధించిన పూర్తి డెమోని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు , బోర్డు సభ్యులు, ఈవోతో కలిసి తిలకించారు. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియపరుస్తూ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ రెండు కంపెనీలు తమ డెమోని సబ్మిట్ చేశాయి.. వీళ్లతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని తెలిసింది. 
 
ఇకపోతే.. గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించే అవసరం లేకుండా గంట.. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్‌ రికగ్నేషన్‌ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments