Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీసీఎస్‌‌ అదుర్స్.. 6 నెలల్లోపు మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి..?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (10:38 IST)
TCS
దేశీయ ఐటీ దిగ్గ జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌) తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని విభాగాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్‌ నిలిచింది. ఈ ప్రకటనతో టీసీఎస్‌లోని దాదాపు 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 
 
తాజా నిర్ణయంతో దేశంలోని టీసీఎస్‌ ఉద్యోగుల వేతనాలు సగటున 12 నుంచి 14 శాతం వరకు పెరిగే అవకాశముంద, విదేశాల్లో పనిచేస్తున్న (ఆఫ్‌షోర్‌) ఉద్యోగులకు ఈ పెంపు 6 నుంచి 7 శాతం మేరకు ఉండవచ్చని సమాచారం. టీసీఎస్‌ ఉద్యోగుల వేతనాలు పెరగనుండటం ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ సంస్థ గతేడాది అక్టోబర్‌లో ఉద్యోగుల వేతనాలను పెంచింది. 
 
కాగా, టీసీఎస్‌ తాజా నిర్ణయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. నిబంధనలకు లోబడి ఏప్రిల్‌ 1 నుంచి అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో కంపెనీని వినూత్న ఆలోచనలతో ముందుకు నడిపిన టీసీఎస్‌ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఉద్యోగుల పట్ల కంపెనీకి గల నిబద్ధతకు వేతనాల పెంపు నిర్ణయమే నిదర్శనమని చెప్పారు. 
 
కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో టీసీఎస్‌ క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ పెరగడం కంపెనీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో 2020 డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌ నికర లాభం 7.2 శాతం పెరిగి రూ.8,701 కోట్లకు వృద్ధి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments