Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్.. ఉద్యోగులు కాలు బయటపెట్టొద్దు.. ఐటీ సంస్థలు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (22:54 IST)
కరోనా ఎఫెక్ట్‌, సెకండ్ వేవ్ కారణంగా ఐటీ కంపెనీలు ఇక పూర్తిగా వర్క్‌ఫ్రమ్ హోం ప్లాన్‌లో మునిగిపోయాయి. పలు రంగాలకు చెందిన కంపెనీలు వైట్ కాలర్ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐబీఎం, రేమాండ్, మోతీలాల్ ఓస్వాల్, డెలాయిట్, శాప్ ఇండియా తదితర దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగుల ఆరోగ్య భద్రతమే ప్రాధాన్యత ఇస్తున్నాయి.. పూర్తి వర్క్ ఫ్రమ్ హోంకే ప్లాన్ చేస్తున్నాయి.
 
ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఇవ్వడమే కాదు.. ఇక అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టవద్దని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. తాజాగా.. ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు ఉద్యోగులకు ఓ మెయిల్ పంపించారు. మీరు ఇంటికి నుంచి బయటకు వెళ్లినప్పుడు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని మెయిల్‌లో సూచించారు.
 
మరోవైపు.. ఈ ఏడాది జూన్ చివరి వరకూ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని టీసీఎస్, ఐబీఎంలు కోరగా.. శాప్ ఇండియా ల్యాబ్స్ తమ బెంగళూర్ క్యాంపస్‌లో అర్హులైన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చేపట్టింది. ఐటీసీ సైతం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ముందస్తు అనుమతి లేనిదే ఏ ఒక్కరూ కార్యాలయానికి రావద్దని కోరింది. అంటే.. ఓవైపు.. ఉద్యోగులతో పని చేయించుకుంటూనే.. మరోవైపు.. వారి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తున్నాయి ఐటీ కంపెనీలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం