Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారనున్న మొబైల్ నంబర్లు.. ఇకపై 10 అంకెల స్థానంలో 13 అంకెలతో నంబర్

దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు మారనున్నాయి. ప్రస్తుతమున్న 10 అంకెల నంబర్లు ఇకపై 13 అంకెల నంబర్లుగా కనిపించనున్నాయి. వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:01 IST)
దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు మారనున్నాయి. ప్రస్తుతమున్న 10 అంకెల నంబర్లు ఇకపై 13 అంకెల నంబర్లుగా కనిపించనున్నాయి. వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
'మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌ (ఎం2ఎం)లో స్పెక్ట్రమ్, రోమింగ్, క్యూవోఎస్‌కు సంబంధించి' టెలీకాం కంపెనీ నిర్ణయం తీసుకుంది. టెలీకం శాఖ సిమ్ ఆధారిత ఎం2ఎం డివైజ్‌ల కోసం 13 అంకెల నంబరింగ్ సిరీస్‌ను ఆమోదించింది. ఫలితంగా ఇప్పటికే చలామణీలో ఉన్న 10 అంకెల నంబర్‌తో పాటు పనిచేసే విధంగా కొత్త నంబరింగ్ విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. 
 
ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు... 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ యేడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది.
 
'ఈ యేడాది జూలై 1 నుంచి 13 అంకెల ఎం2ఎం నంబర్ విధానాన్ని అమలు చేయాలని టెలీకాం శాఖ నిర్ణయించింది. ఆ రోజు నుంచి కొత్తగా తీసుకునే అన్ని మొబైల్ ఫోన్ నంబర్లలో 13 అంకెలు ఉంటాయి. ఇప్పటికే 10 అంకెల నంబర్‌ వాడుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోపు కొత్త నంబర్‌కు మారాల్సి ఉంటుంది' అని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments