Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్లపై 10 - 14 శాతం మేరకు ధరలు తగ్గించిన సోనీ

సోనీ ఇండియా కంపెనీ తన ఫోన్ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లపై ధరలను ఏకంగా 10 నుంచి 14 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ కంపెనీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (06:46 IST)
సోనీ ఇండియా కంపెనీ తన ఫోన్ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లపై ధరలను ఏకంగా 10 నుంచి 14 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ కంపెనీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎక్స్‌పీరియా ఎక్స్‌, జెడ్‌ 5లు ఉన్నాయి. 
 
సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్‌ ధర ఆరంభంలో రూ.48,990 ఉండగా, ఇప్పుడు రూ.10 వేలు తగ్గి రూ.38,990కి చేరుకుంది. అలాగే, ఎక్స్‌పిరియా జెడ్‌5 ప్రీమియం ధర రూ.55,990 కాగా, దీని ధరలో 14 శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ.47,990కే ఇది లభిస్తోంది. భారత్‌లో ప్రీమియం కేటగిరి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది. 
 
మరోవైపు... స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌లో అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 25.1శాతం వాటాతో శామ్‌సంగ్‌ది ప్రథమ స్థానంలో  ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్‌ (12.9శాతం), లెనోవో గ్రూప్‌ (7.7శాతం), ఇంటెక్స్‌ (7.1శాతం) ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments