చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ రెడ్మీ నోట్7 మరియు రియల్మీ యూ1లకు పోటీగా శామ్సంగ్ ప్రవేశపెట్టిన గెలాక్సీ ఎ20 శుక్రవారంనాడు భారత్లో విడుదలైంది. వచ్చే వారం నుండి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా... 3జీబీ ర్యామ్+32 జీబీ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభించే ఈ ఫోన్ ధర రూ.12,490గా ఉంది.