దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. ల్యాప్ టాప్ రంగంలో మరో సంచలనానికి తెరతీసింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో జియో తన తొలి ల్యాప్టాప్ను ప్రదర్శించింది. ఈ ల్యాప్టాప్కు జియోబుక్ అని పేరు కూడా పెట్టింది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.15,799గా నిర్ణయించింది.
బడ్జెట్ ధరలో ఈ ల్యాప్టాప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ల్యాప్ టాప్ బాగా పనిచేస్తుంది. జియోఓఎస్ ఆధారిత జియోబుక్లో థర్డ్ పార్టీ యాప్స్కు యాక్సెస్ వుంటుంది. ఎంబెడెడ్ జియో సిమ్ కార్డు.. 5జీ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది.