Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1000, రూ.1500కే జియో ఫోన్లు... టచ్ స్క్రీన్ సౌకర్యం మాత్రం లేదు...

దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులన

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (10:12 IST)
దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకునేందుకు వీలుగా అతి తక్కువ ధరకు 4జీ మొబైల్స్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
ప్రధానంగా రూరల్, టైర్ 2 కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఇంకా 2జీపై ఆధారపడడంతో కేవలం 1000, 1500 రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది.
 
దీంతో సరికొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనలో రిలయన్స్ జియో వుంది. ఆ ఫోనులో ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఇవి స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్‌లు పనిచేస్తాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే ఇందులో ఉండదని పేర్కొంది. అయితే, ఈతరహా ఫోన్లను 2017లో అందుబాటులోకి తెచ్చే వెసులుబాటు ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments