Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో యానివర్శరీ ఆఫర్.. రూ.500కే 4జీ ఫోన్... నిజమా?

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేసే దిశగా పయనిస్తోంది. దేశంలో జియో సేవలు ప్రారంభమై ఈనెల 21వ తేదీతో ఒక యేడాది పూర్తికానున్న సందర్భంగా జియో

Webdunia
గురువారం, 20 జులై 2017 (09:01 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేసే దిశగా పయనిస్తోంది. దేశంలో జియో సేవలు ప్రారంభమై ఈనెల 21వ తేదీతో ఒక యేడాది పూర్తికానున్న సందర్భంగా జియో యానివర్శరీ ఆఫర్ పేరుతో వినియోగదారులకు ఆఫర్లు ఇవ్వనుంది. ఇందులోభాగంగా, రూ.500కే 4జీ టెక్నాలజీతో కూడిన ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అలాగే, సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. 
 
ధన్‌ ధనాధన్ ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రూ.349, రూ.399తో రెండు ప్లాన్లు ప్రకటించిన జియో 21న జరగనున్న సమావేశంలో రూ.80 - రూ.90 మధ్యలో ఉండే మరో ప్లాన్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్లాన్ పాత వినియోగదారులకా? లేక కొత్తగా రాబోతున్న 4జీ ఫీచర్ ఫోన్‌కా? అన్న విషయంలో స్పష్టత లేదు. 
 
వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవలను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇప్పటికే పలు నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఈ కనెక్షన్‌తో 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలలపాటు ఫ్రీగా అందించనున్నారు. అయితే ఈ సేవలు పొందాలంటే తొలుత రూ.4500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. 
 
కాగా, ఈనెల 21న జరగనున్న ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ ఆఫర్లపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు ఇప్పటి నుంచే కంటిమీద కునుకులేకుండా పోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments