Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ టెలికాం మార్కెట్‌పై జియో కన్ను.. రూ.501 రీఛార్జ్ చేసుకుంటే?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ టెలికామ్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐఎస్‌డీ కాల్ రేట్స్‌కు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (13:24 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ టెలికామ్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐఎస్‌డీ కాల్ రేట్స్‌కు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.501తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నిమిషానికి ఇంటర్నేషనల్ కాల్స్‌కు మూడు రూపాయల చొప్పున చెల్లించి పొందవచ్చునని జియో తెలిపింది. దీనిని రేట్ కటర్ ప్లాన్‌గా జియో ప్రకటించింది. 
 
అంతేకాదు, 501 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే సర్వీస్ యాక్టివేషన్‌తో పాటు పూర్తి మొత్తంలో బ్యాలెన్స్ కూడా పొందొచ్చు. ఇందులో భాగంగా అమెరికా, ఇంగ్లండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమవారికి భారత్ నుంచి కేవలం నిమిషానికి 3రూపాయలు చెల్లించి కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. 
  
ఈ ఐఎస్డీ కాల్స్ హాంకాంగ్, ఇటలీ, మంగోలియా, మొరాకో, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్,  అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, రొమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్ దేశాలకు కూడా నిమిషానికి 3 రూపాయలు చెల్లించి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.
 
మరోవైపు రిలయన్స్ జియో మరో సంచలనమైన ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి జియో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొత్తగా శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 448 జీబీ 4 జీ డేటాను 8 మాసాలపాటు ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే నెలకు రూ.309 లతో రీచార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది. అలాగే ధనాధన్ ప్లాన్ కిందే ఈ ఆఫర్ ను తెచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments