Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో షాక్ : 3 నెలల్లో ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయకుంటే సర్వీస్‌లన్నీ బంద్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్‌లో రీచార్జ్ చేయాల్సిందేనని లేకుంట

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (12:28 IST)
రిలయన్స్ జియో తన వినియోగదారులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్‌లో రీచార్జ్ చేయాల్సిందేనని లేకుంటే ఔట్ గోయింగ్ కాల్స్ బంద్ అవుతాయని తేల్చి చెప్పింది. 
 
రిలయన్స్ జియో తాజా ప్రకటన మేరకు ఈనెల 31వ తేదీ లోపు 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందే. ఈ సభ్యత్వం తీసుకున్నాం కదా రీచార్జ్ చేయించాల్సిన పనేం లేదని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్టేనని పేర్కొంది. 99 రూపాయలతో రీచార్జ్ చేయించింది ఏడాది పాటు అదనపు లాభాలు పొందడానికి మాత్రమేనని జియో స్పష్టమైన వివరణ ఇచ్చింది. 
 
రూ.99 రీచార్జ్‌తో పాటు... జియో ప్రైమ్ యూజర్లు కూడా ఏదో ఒక ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకోవాలని జియో యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది. లేకపోతే జియో సేవలు నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. రీచార్జ్ చేయించకపోతే కాల్స్ చేయడానికి అనర్హులని తేల్చేసింది. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయని, ఔట్ గోయింగ్ కాల్స్ సర్వీస్ ఉండదని తెలిపింది. మూడు నెలల్లోపు ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయించకపోతే సర్వీస్ పూర్తిగా నిలిపివేస్తామని కూడా జియో స్పష్టం చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments