Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక షియోమీ స్మార్ట్ టీవీలు.. అతి తక్కువ ధరకే...

అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలో చైనాకు చెందిన షియోమీ రెడ్మీ అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను భారత మా

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (17:13 IST)
అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలో చైనాకు చెందిన షియోమీ రెడ్మీ అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఫోన్లు ఎంఐ పేరుతో కుప్ప తెప్పలుగా సేల్ అవుతున్నాయి. ఫలితంగా ఇపుడు దేశవ్యాప్తంగా ఎంఐ ఫోన్ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. 
 
ఇందుకోసం దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోతో జట్టు కట్టనుంది. త్వరలో ఇండియాలోకి తీసుకురానున్న షియోమీ 50 అంగుళాల టీవీలను జియో రిటైల్‌ స్టోర్లలో లాంచ్‌ చేసేందుకు సిధ్ధమైంది. రెండు సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు లక్షల్లో ధరలు పలికే ఎల్.సి.డి, లెడ్ టీవీలను.. ఇకపై రూ.వేలల్లోనే అందించనున్నట్లు సమాచారం. 
 
ఈ టీవీలు మరికొన్ని నెలల్లోనే రిలయన్స్‌ జియో డిజిటల్‌ స్టోర్స్‌లలో విక్రయానికి ఉంచనుంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ వంటి దిగ్గజ సంస‍్థల ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే ఫీచర్‌, రిచ్‌, హై ఎండ్‌ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహంతో రిలయన్స్ జియోతో షియోమీ ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments