స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ నుండి ఎన్నో రకాల మొబైల్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. అయితే తాజాగా దాని అనుబంధ సంస్థ అయిన రెడ్మీ దాని నుండి విడిపోయిన తర్వాత రెడ్మీ గో పేరుతో స్మార్ట్ఫోన్ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో అనేది ఆండ్రాయిడ్కు లైట్ వెయిట్ వెర్షన్.
దీని ధర తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఫోన్లు ఎంచుకునే వారికి బేసిక్ ప్రత్యేకతలతో రెడ్మీ గో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి నెలలో యూరప్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్లో మాత్రం ఎప్పుడు రిలీజ్ కానుందో ఇంకా స్పష్టత లేదు.