మొబైల్స్ తయారీదారు సంస్థ రియల్మి భారత మార్కెట్లో రియల్మి 5 ప్రో పేరిట కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది.
ఈ ఫోన్లో టాప్ ఎండ్ మోడల్ వేరియంట్ 8 జీబీ, 128 జీజీ స్టోరేజ్ గల స్మార్ట్ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ 4వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్, అలాగే రియల్మి ఆన్లైన్ స్టోర్స్లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.