Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:06 IST)
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వాడుక దారులకు షాకింగ్ న్యూస్. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఇక సర్ ఛార్జ్‌లు తప్పవు. ఎందుకంటే పేటీఎం ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది. 
 
ఈ రుసుము రూ. 1 నుండి రూ. 6 వరకు ఉంటుంది. సర్‌ఛార్జ్ ఎంత అనేది మీరు చేసుకునే రీఛార్జ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లపై వర్తించనుంది. గతేడాది.. ఫోన్‌పే తన కస్టమర్‌లకు రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్‌ని అమలు చేసిని విషయం తెలిసిందే. 
 
ఈ విషయంపై ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు తమ పోస్టుల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి నుంచే పేటీఎం ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఛార్జీలు పడుతున్నాయి. 
 
ప్రస్తుతం.. ఈ రుసుము రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో, పేటీఎం దాని వినియోగదారుల నుండి సర్‌ఛార్జ్ రుసుములను వసూలు చేయదని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments