Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదు..

రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వ

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (09:27 IST)
రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ వెల్లడించింది. 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదని ఆ సంస్థ తెలిపింది. కానీ కాల్ డ్రాప్స్ విషయంలో జియో 54 శాతం కాల్ డ్రాప్స్‌ను నమోదు చేసుకుంది. తద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది.
 
ఇదిలా ఉంటే.. 90 శాతం రిలయన్స్ జియో యూజర్లు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లో ఉన్నారని.. 76 శాతం మంది జియో సర్వీసు ముగిసేంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 84మంది జియో యూజర్లు రూ.303, రూ.309 ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments