జూలై నుంచి మొబైల్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 5జీ ఫోన్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (16:43 IST)
మొబైల్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. జూలై ఒకటో తేదీ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోనును అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ 8జీ ర్యామ్, 128 జీపీ స్టోరేజ్ వేరియంట్, 12జీ ర్యామ్, 256 జీవీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి జూలై ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. ఈ ఫోన్ విక్రయాలు జూలై 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు వేరియంట్లలో తయారు చేశారు. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999, రూ.33,999గా నిర్ణయించినట్టు సమాచారం. 
 
అయితే, ఈ ధరల వివరాలను వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఇతర ఫోన్లను కొనుగోలు చేసినట్టుగానే వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఈకామర్స్ సైట్లలో బుక్ చేసుకోవాల్సివుంది. ఈ ఫోనును షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments