Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ : ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లకు 3 నెలలు ఉచిత డేటా

రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ లైన్ కస్టమర్లకు మూడు నెలల పాటు ఉచిత డేటాను అందచేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సరికొత్త బ్రాడ్‌బ్యాం

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (15:34 IST)
రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ లైన్ కస్టమర్లకు మూడు నెలల పాటు ఉచిత డేటాను అందచేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సరికొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉచిత కాల్స్‌ను కూడా అందించనుంది. వి-ఫైబర్‌ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్‌లైన్‌ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించే విధంగా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్టు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ముంబై) సమీర్‌ బాత్రా తెలిపారు. 
 
దీని ద్వారా 100 ఎంబిపిఎస్‌ వరకు వేగంతో డేటాను అందించవచ్చన్నారు. ఇప్పటికే తమకు 3.51 లక్షల మంది ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లున్నారని, వీరిలో అధిక శాతం మంది ఎంటర్‌ప్రైజెస్‌ కస్టమర్లేనని ఆయన తెలిపారు. వీరంతా హైస్పీడ్‌ కవరేజీకి మారవచ్చన్నారు. కొత్త ప్లాన్‌ తీసుకున్న వారికి మూడు నెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవన్నారు. 10 జిబి కలిగిన బేసిక్‌ ప్లాన్‌ 599 రూపాయలతో ప్రారంభం అవుతుందని చెప్పారు. 1,299 రూపాయల రెంటల్‌తో నెలకు 60 జిబి డేటా ప్లాన్‌ను తీసుకునే వారికి ఉచిత అపరిమిత కాలింగ్‌ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments