Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌... అక్టోబర్ 20న విడుదల

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (18:44 IST)
Nokia XR20,
భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ ఈనెలలో లాంఛ్ చేయనుంది. అక్టోబర్ 20న నోకియా ఎక్స్ఆర్‌20 ప్రీబుకింగ్స్ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతాయని నోకియా ఇండియా ప్రకటించింది. ప్రీలాంఛ్ ఆఫర్ కింద ఫోన్‌తో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్‌, ఏడాది పాటు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది.
 
ఇక భారత్‌లో సీ30 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్ చేస్తామని నోకియా ఇండియా ప్రకటించింది. నోకియా ఎక్స్ఆర్20 డ్రాప్ రెసిస్టెంట్‌..స్క్రాచ్ రెసిస్టెంట్‌..టెంపరేచర్ రెసిస్టెంట్‌..వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. 
 
ఎక్స్ఆర్‌20 భారత్‌లో 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఆర్ఓఎం వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫుల్ హెచ్‌డీప్లస్ స్క్రీన్‌, బ్యాక్ ప్యానెట్‌లో టూ కెమెరా సెటప్‌తో 6.67 ఇంచ్‌ల ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
 
4630ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫుల్ చార్జితో ఫోన్ రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానున్న నోకియా ఎక్స్ఆర్‌20 ధర రూ 38,000 నుంచి రూ 42,000 మధ్య అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments