భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌... అక్టోబర్ 20న విడుదల

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (18:44 IST)
Nokia XR20,
భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ ఈనెలలో లాంఛ్ చేయనుంది. అక్టోబర్ 20న నోకియా ఎక్స్ఆర్‌20 ప్రీబుకింగ్స్ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతాయని నోకియా ఇండియా ప్రకటించింది. ప్రీలాంఛ్ ఆఫర్ కింద ఫోన్‌తో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్‌, ఏడాది పాటు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది.
 
ఇక భారత్‌లో సీ30 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్ చేస్తామని నోకియా ఇండియా ప్రకటించింది. నోకియా ఎక్స్ఆర్20 డ్రాప్ రెసిస్టెంట్‌..స్క్రాచ్ రెసిస్టెంట్‌..టెంపరేచర్ రెసిస్టెంట్‌..వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. 
 
ఎక్స్ఆర్‌20 భారత్‌లో 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఆర్ఓఎం వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫుల్ హెచ్‌డీప్లస్ స్క్రీన్‌, బ్యాక్ ప్యానెట్‌లో టూ కెమెరా సెటప్‌తో 6.67 ఇంచ్‌ల ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
 
4630ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫుల్ చార్జితో ఫోన్ రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానున్న నోకియా ఎక్స్ఆర్‌20 ధర రూ 38,000 నుంచి రూ 42,000 మధ్య అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments