Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలు.. నోకియా ప్రకటన

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:21 IST)
నోకియా కీలక విషయాన్ని తెలిపింది. భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలను తయారు చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది. వీటిని ఇప్పటికే 5జీ వినియోగానికి శరవేగంగా ఏర్పాటు చేస్తున్న దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో 5జీ న్యూ రేడియో తయారు చేసిన సంస్థగా నోకియా నిలిచింది. తాజాగా నోకియా ఎయిర్‌స్కేల్‌ మాసివ్‌ మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ మల్టిపుల్‌ ఔట్‌పుట్‌ (ఎంఐఎంవో) పరికరాలు కూడా సిద్ధం చేసినట్లు కంపెనీ పేర్కొంది.
 
మరోవైపు భారత్‌లో 5జీ సర్వీసుకు టెలికమ్‌ ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాల్సి ఉంది. కాగా భారత్‌లో తొలి 5జీ ఎన్ఆర్ తయారీ సంస్థ మాదేనని నోకియా సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, భారతీయ మార్కెటింగ్‌ విభాగం హెడ్‌ సంజయ్‌ మాలిక్ తెలిపారు.  
 
అత్యుత్తమ స్థాయి పరికరాల తయారీలో భారత్‌ శక్తిని వెల్లడించాయి. భారతీయ టెలికమ్‌ ఆపరేట్లర్లు 5జీ సేవలు అందించడానికి ఇవి సహకరిస్తాయి. నోకియా చెన్నై ఫ్యాక్టరీ అత్యాధునిక 5జీ మాసీవ్‌ ఎంఐఎంవో పరికరాలు తయారు చేసి ఎగుమతి చేస్తోంది. 2008 నుంచి ఆ ప్లాంట్‌లో దాదాపు 50 లక్షల టెలికం పరికరాలను తయారు చేశాం. వీటిని దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేశామని మాలిక్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments