Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్: తొలగించిన పోలీసులు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:18 IST)
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను యూపీలోని వారణాసి పోలీసులు తొలగించారు. ప్రధాని మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. సుందర్ పిచాయ్‌తో పాటు గూగుల్‌కి చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నప్పటికీ.. చివరకు అసలు విషయం తెలిసి.. నాలుక్కరుచుకున్నారు. 
 
ఈ వీడియో మొదట వాట్సాప్ గ్రూప్‌లో, ఆ తరువాత యూ ట్యూబ్ లో సర్క్యులేట్ అయిందని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని, వారణాసి లోని ఓ వ్యక్తి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ వెంటనే తన మొబైల్ ఫోన్‌కు ఎనిమిదిన్నర వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. సుందర్ పిచాయ్ సహా సంజయ్ కుమార్ గుప్తా తదితరుల పేర్లు ఈ ఎఫ్‌ఐ‌ఆర్‌లో ఉన్నాయి.
 
దీనిపై గూగుల్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో సాంగ్‌ను ఘాజీపూర్ లోని మ్యుజిషియన్లు రూపొందించారని, వారితో బాటు రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ లేబెల్ కంపెనీ నిర్వాహకులకు కూడా ఈ కేసుతో ప్రమేయమున్నట్టు పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments