Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు రెడీ.. మైక్రోసాఫ్ట్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:28 IST)
భారత్‌ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో భారతదేశానికి సంబంధించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌కు మైక్రోసాఫ్ట్ సహాయం గురించి కూడా ఒక ముఖ్యమైన చర్చ జరిగింది. 
 
అలాగే, భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్‌ను ప్రధాని మోదీ కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందన్నారు. 
 
భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ మనీ లావాదేవీలు పెరుగుతున్నాయని, మైక్రోసాఫ్ట్ సహాయంతో ఇది మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో కొత్త క్లౌడ్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడి పెడుతుందని నాదెళ్ల సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments