Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు రెడీ.. మైక్రోసాఫ్ట్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:28 IST)
భారత్‌ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో భారతదేశానికి సంబంధించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌కు మైక్రోసాఫ్ట్ సహాయం గురించి కూడా ఒక ముఖ్యమైన చర్చ జరిగింది. 
 
అలాగే, భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్‌ను ప్రధాని మోదీ కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందన్నారు. 
 
భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ మనీ లావాదేవీలు పెరుగుతున్నాయని, మైక్రోసాఫ్ట్ సహాయంతో ఇది మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో కొత్త క్లౌడ్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడి పెడుతుందని నాదెళ్ల సూచించారు.

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments