Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 12 ఐఫోన్ల తయారీ- యాపిల్ ప్రకటనతో పెరగనున్న ఉద్యోగవకాశాలు

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:26 IST)
యాపిల్ కంపెనీ ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ పార్టనర్ కంపెనీ ఫాక్స్‌కాన్ సాయంతో తమిళనాడులో ఉన్న ప్లాంటులో ఐఫోన్ 12 ఫోన్లను అసెంబుల్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఈ విషయాన్నికేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ధ్రువీకరించారు. 
 
తమిళనాడులో యాపిల్ నిర్ణయం వల్ల మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ట్వీట్ చేశారు. యాపిల్ 2017లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. ఈ సంస్థకు ఫాక్స్ కాన్, విస్రాన్ వంటి థర్డ్ పార్టీ మ్యాన్యూఫాక్చరింగ్ కంపెనీలతో పార్ట్ నర్‌షిప్ ఉంది. వీటి సాయంతో యాపిల్ మన దేశంలో ఉత్పత్తులను తయారుచేస్తోంది.
 
భారత్‌లో ఐఫోన్ 12 మోడళ్ల తయారీపై యాపిల్ నిర్ణయం తీసుకోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ అధికారికంగా స్పందించింది. ప్రస్తుతం ఐఫోన్ 12 బేస్ మోడళ్లను మాత్రమే భారత్‌లో తయారు చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఎప్పటిలాగానే చైనా నుంచి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడళ్ల దిగుమతులు కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments