Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ

జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (18:55 IST)
జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా క్యూలో వున్నారు. 
 
జియో ఇస్తున్న పోటీకి ఎయిర్ టెల్, వొడాఫోన్ దిమ్మతిరిగిపోతున్నాయి. పోటీని తట్టుకోవడం అటుంచి వున్న కస్టమర్లనే కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇది జియో తరహాలోనే వుంది. 
 
రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందిస్తామని ప్రకటించింది. అలాగే రూ.149 ప్లాన్‌ను 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే స‌దుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఆఫర్‌కు ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments