Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో సేవలకు ఏడు వసంతాలు.. కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లు

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (18:30 IST)
పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సేవలు దేశంలో ప్రారంభమై ఏడేళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా జియో మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఈ వివరాలను కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. 
 
జియో వెబ్ సైట్ ప్రకారం.. రూ.299 ప్లాన్‌లో రోజువారీ 2జీబీ ఉచిత డేటాను పొందొచ్చు. ఉచిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీనికి అదనంగా 7జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాల వ్యవధి 28 రోజులు.
 
అలాగే, రూ.749 ప్లాన్‌లో రోజువారీ 2జీబీ ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితోపాటు 14జీబీ డేటా అదనంగా లభిస్తోంది. దీని గడువు 90 రోజులు. రూ.2,999 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. 
 
ఇందులో రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 21జీబీ ఉచిత డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి మెక్ డొనాల్డ్ మీల్‌పై ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై 10 శాతం రాయితీని కూడా పొందొచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments