Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్.. ధర రూ.2,500..?

జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకో

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:30 IST)
జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ జరుపుతున్న చర్చలు ఫలించాయని సమాచారం.

అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ.. ఆ ఫోనును ఫీచర్ ఫోనుతో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో కొత్త ఫోను తీసుకువస్తున్నట్లు ఎయిర్ టెల్  వర్గాల సమాచారం. 
 
ఈ ఫోను దసరా, దీపావళి పండగ సీజన్లో మార్కెట్లో రావచ్చునని తెలిసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అన్ని రకాల యాప్స్‌ను వాడుకోదగిన ఈ ఫోను.. జియో ఫీచర్ ఫోన్‌తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగివుంటుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. కానీ డీల్ కుదిరిందా..? లేదా అనేది ఎయిర్ టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments