జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై అందుబాటులోకి ఉచితంగా వైఫై వీడియో కాల్స్

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (18:18 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ.. కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌ను ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ వైఫై వాయిస్, వీడియో కాల్స్ క్లియర్‌గా వుంటాయని.. ఇందుకు అదనపు చెల్లింపు అవసరం లేదని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సదుపాయం దేశ వ్యాప్తంగా వుంటాయని.. ప్రస్తుతానికి 150 హ్యాండ్ సెట్లకు అందుబాటులో వుంటుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయాన్ని ముంబైలో జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను గుర్తించే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చామన్నారు. సగటు జియో వినియోగదారుడు నెలకు 900 నిమిషాల వాయిస్ కాల్స్ చేస్తున్నట్టు గుర్తించామని.. కస్టమర్ల సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించాం. ఇప్పటికే వోల్ట్ నెట్‌వర్క్‌ను మొదటిసారి ఇండియాకు పరిచయం చేసిన ఘనత కూడా జియోదేనని ఆకాష్ అంబానీ తెలిపారు. 
 
జియో వైఫై కాలింగ్ సదుపాయాన్ని విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని.. దేశ వ్యాప్తంగా జనవరి 7వ తేదీ నుంచి 16వ తేదీలోపు పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని జియో వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. ఇకపోతే.. స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే ఈ సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీ ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు Jio.com/wificalling వెబ్‌సైట్‌‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments