జియో సూపర్ కాంబో ప్లాన్.. రూ.199కి 1000 జీబీ డేటా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:16 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొందరు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టెలికాం రంగ సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ (ఫైబర్-టు-హోమ్) వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన కాంబో ప్లాన్‌ను ప్రకటించింది. రూ.199లకు వేగవంతమైన 1000 జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే 7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
 
ఈ కాంబో ప్లాన్ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్‌కు పడిపోతుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments