'గూగుల్ పే'ని వినియోగిస్తున్నారా..? ఆ లింకుతో జాగ్రత్త.. క్లిక్ చేశారో?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (14:07 IST)
గూగుల్ పేను వినియోగిస్తున్నారా.. అయితే ఆ లింకుతో జాగ్రత్త అంటున్నారు.. ఐటీ నిపుణులు. లింకుపై క్లిక్ చేస్తే డబ్బు పొందవచ్చు అని మెసేజ్ వస్తే ఆ లింకును క్లిక్ చేయకపోవడమే మంచిదని వారు చెప్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం వుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు సైబరాబాద్‌లో జరిగిన సంఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఇటీవల గూగుల్ పే తరహాలోనే ఓ మెసేజ్ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీ కేవైసీ, ఖాతా వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని అందులో ఉంది. అందులో ఓ గూగుల్ లింక్ కూడా ఉంది. దీంతో ఆయన దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేశారు. అవి సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో ఆయన అకౌంట్లో ఉన్న రూ.5.29 లక్షలు మాయమయ్యాయి.
 
ఆ లింకు మాత్రమే కాకుండా.. ఇతర సోషల్ మీడియాల్లో షేరవుతున్న గూగుల్ పే స్క్రాచ్ కార్డు లింకును క్లిక్ చేస్తే చాలా డేంజర్. ఆ లింకు క్లిక్ చేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు వస్తాయంటూ వస్తున్న ఆ మెసేజులు క్లిక్ చేసినా, అందులో మీ వివరాలు పొందుపరిచినా మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

డా. ఎం. మోహన్ బాబు కు బెంగాల్ ప్రభుత్వ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభం, త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments