'గూగుల్ పే'ని వినియోగిస్తున్నారా..? ఆ లింకుతో జాగ్రత్త.. క్లిక్ చేశారో?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (14:07 IST)
గూగుల్ పేను వినియోగిస్తున్నారా.. అయితే ఆ లింకుతో జాగ్రత్త అంటున్నారు.. ఐటీ నిపుణులు. లింకుపై క్లిక్ చేస్తే డబ్బు పొందవచ్చు అని మెసేజ్ వస్తే ఆ లింకును క్లిక్ చేయకపోవడమే మంచిదని వారు చెప్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం వుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు సైబరాబాద్‌లో జరిగిన సంఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఇటీవల గూగుల్ పే తరహాలోనే ఓ మెసేజ్ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీ కేవైసీ, ఖాతా వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని అందులో ఉంది. అందులో ఓ గూగుల్ లింక్ కూడా ఉంది. దీంతో ఆయన దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేశారు. అవి సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో ఆయన అకౌంట్లో ఉన్న రూ.5.29 లక్షలు మాయమయ్యాయి.
 
ఆ లింకు మాత్రమే కాకుండా.. ఇతర సోషల్ మీడియాల్లో షేరవుతున్న గూగుల్ పే స్క్రాచ్ కార్డు లింకును క్లిక్ చేస్తే చాలా డేంజర్. ఆ లింకు క్లిక్ చేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు వస్తాయంటూ వస్తున్న ఆ మెసేజులు క్లిక్ చేసినా, అందులో మీ వివరాలు పొందుపరిచినా మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'బాహుబలి' రికార్డును బద్ధలు కొట్టిన 'ధురంధర్ : ది రివెంజ్'

Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది

Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్‌లో రామ్ చరణ్

Akshaye Khanna: మహాకాళి లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఖన్నా

Biker: శర్వా 23 కేజీలు తగ్గారు - న్యూజీలాండ్, ఆస్త్రేలియా రేసర్స్ ని రప్పించాము : అభిలాష్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

తర్వాతి కథనం
Show comments