Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడి.. ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:01 IST)
కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. 
 
రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌ను విస్తరించనుంది ఇన్ఫోసిస్. దీంతో దాదాపు 20 వేల మందికి నూతనంగా ఉద్యోగవకాశాలు రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
 
ఈ నిధులతో సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ బ్లాక్‌లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, ఇతర సదుపాయల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్‌ను 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది. ఘటకేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది. ఈ తాజా విస్తరణ ద్వారా మరో నాలుగు ఐటీ డవలప్మెంట్ బ్లాకులను కంపెనీ నిర్మించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments